జనసైనికుడు ముమ్మిడి గంగను పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం ఎస్ ఈ జెడ్ నందు జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి ముమ్మిడి గంగ గత కొద్ది నెలలుగా యాక్సిడెంట్ కారణంగా బెడ్ రెస్ట్ తీసుకుంటూ కాళ్ళకున్న ప్లేట్లను తొలగించిన కారణంగా మన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు పల్లెటి బాపన దొర, బండి దొరబాబు, పుణ్యమంతుల సుబ్రమణ్యం, తైల బాబులు, ముమ్మడి విష్ణు జోగులు, మారెళ్ళ అప్పారావు, పోలవరపు సత్తిబాబు, బావిశెట్టి బాబి, జి నాగ సతీష్, నిమ్మ సుబ్బారావు, కోనాల సూరిబాబు, మల్కా సూర్యచంద్రరావు, మల్కా శ్రీనివాస్, తమ్మున్న దొర, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, సూరిబాబు, సూర్యచంద్ర, శ్రీను, సుబ్బారావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.