తిరుపతి మీడియా సమావేశంలో డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతిలో జరిగిన భూ కుంభకోణం సంబందించి జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1500 టి డి ఏ బండ్లకు గాను 342 మాత్రమే ఇచ్చారని మిగతా పేద ప్రజలకు అన్యాయం చేసారని కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు తెలియజేసారు. అలాగే ఎన్.డి.ఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితులందరికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు, ఈ కుంబకోణంలో ఎవరు అయితే ఉన్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని వారికి తగిన బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన ప్రజలకు అండగా ఉంటాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి నాయకులు అందరూ పాల్గొన్నారు.