అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను సందర్శించినడా. విశ్వక్సేన్

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జి.సిగడాం హెడ్‌క్వార్టర్‌ సమీపంలో సావిటీ హరిశంకర్ ప్రకాశ్, బలరాం, ముద్దాడ త్రినాథ్, బోనెల గౌరీ శంకర్ స్కూల్ యాజమాన్యం ఆహ్వానంతో నూతనంగా ప్రారంభమైన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. విశ్వక్సేన్ సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా డా. విశ్వక్సేన్ విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు పరిశీలించి, నూతన విద్యాసంస్థకు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ స్థాయి పాఠశాలలు స్థాపితమవడం సానుకూల మార్పుకు సూచిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పొగిరి అప్పలనాయుడు, రామరాజు, రణస్థలం మండల జనసేన నాయకులు మైలపల్లి రాంప్రసాద్ గారులతో పాటు అనేకమంది జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment