ఓటు హక్కును వినియోగించుకున్న డా. పసుపులేటి

తిరుపతిలో 4వ వార్డ్ చింతలచినులోని ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలసి క్యూ లైన్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన పార్టీ రాష్ట్ర పి.ఏ.సి సభ్యులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్. ఓటు వినియోగించుకున్న తరువాత హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును తమ కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవడం పట్ల జనసేన జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసారు.