శ్రీమతి సావిత్రమ్మ కు నివాళులు అర్పించిన డాక్టర్ యుగంధర్ పొన్న
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం., ఆర్.కే.వి.బి పేట గ్రామ పంచాయతీలోని రాజుల కండ్రిగ గ్రామంలో వైసిపి ఎంపీటీసీ నాయకులు రామ్మూర్తి తల్లి శ్రీమతి సావిత్రమ్మ పరమపదించగా.. ఆమె భౌతిక కాయానికి నియోజకవర్గ జనసేన ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు నరేష్, వెంకటేష్, బూత్ కన్వీనర్ అన్నామలై, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసేన నాయకులు నాదముని, శరత్, శివ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-30-at-3.08.11-PM-1024x473.jpeg)