డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. తగు చర్యలు చేపట్టండి..!
ఆలూరు మండలం 4వ వార్డు, ఇంద్రనగర్, డమర వీధిలో డ్రైనేజీ వ్యవస్థ సుభ్రంగా లేనందున మురికి నీరు నిల్వ ఉండి దోమలకు నివాసంగా మారుతున్నాయని. ఇలాంటి సమస్య 2వ, 3వ వార్డులో కూడా ఉందని సర్పంచులు సంబంధిత అధికారులకు శుభ్రపరిచే ఆలోచన లేదని, విషపు రోగాలకు దారి చూపుతున్నారని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా సర్పంచులు, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని, కనీసం దోమల నివారణకు పిచికారి చేయించాలని, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించాలని కోరుకుంటున్నానని ఆలూరు నియోజకవర్గం జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/pa-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-14-at-4.28.09-PM-766x1024.jpeg)