ఉచిత సలహాలు కట్టిపెట్టు ద్వారంపూడీ: ముత్తాశశిధర్

కాకినాడ సిటీ: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదవీ అనే వ్యామోహంలో కొట్టుమిట్టాడుతూ ప్రజా పాలన పక్కన పెడుతున్నారని జనసేన పార్టీపై కార్యకర్తల పై దృష్టి పెట్టే కంటే కాకినాడ నగరంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శశిధర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిద్ధార్థ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి జనసేన పార్టీ పై వ్యక్తిగత ఆరోపణలకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. నీతీ, నిబద్ధతతో నిర్మాణం జరిగిన జనసేన పార్టీని విమర్శించే అర్హత వైకాపా నాయకులకు లేదన్నారు. జనవరి 12వ తేదీన శ్రీకాకళం జిల్లా రణస్థలంలో యువత భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయనున్నారని తెలిపారు. ఇందు కోసం భారీ ఎత్తున యువత రణస్థలం చేరేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడికి భవిష్యత్ రాజకీయం లేదని, ఉన్న ఈ కాస్త సమయమైనా నమ్మి ఒట్లేసినన ప్రజలకు న్యాయం చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి అశోక్, వాసిరెడ్డి శివ, తలాటం సత్య సత్యనారాయణ వంశీ జాక్ శ్రీమన్నారాయణ మౌనిక ధోని సాయి శ్రావణ్ దుర్గ శిరీష హైమావతి మాలతి తదితరులు పాల్గొన్నారు.