రాజోలు జనసేన ఆధ్వర్యంలో ద్వారబంధాల చంద్రయ్య జయంతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో, మలికిపురంలో ఘనంగా గోదావరి జిల్లాల మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ద్వారబంధాల చంద్రయ్య దొర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ద్వారబంధాల చంద్రయ్య విజయనగరం జిల్లా బొబ్బిలిలో పుట్టి, ఖమ్మం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, జిల్లాలలో బ్రిటిష్ వారిపై స్వతంత్రం కోసం తిరుగుబాటు చేసిన మొదటి వ్యక్తి అని ఆయన చేసిన త్యాగాలను మరువలేమని అన్నారు. ఈ కార్యక్రమంలోమలికిపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మేడిచెర్ల సత్యవాణి రాము, బోనం సాయి, మంగళంపల్లి గథా, గుబ్బల రవి కిరణ్, అడ్డాల నరసయ్య నాయుడు (చిన్న), మండెల బాబి నాయుడు, యెనుముల సతీష్, కందులపాటి అంజి, అడ్డాల రాంబాబు, గిడుగు శ్రీనివాస్, అడ్డాల ఏసు, కామిశెట్టి దొరబాబు, మేడిచర్ల దుర్గాప్రసాద్, మల్లిపూడి సాయి, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.