జనసేన జనజాగృతి యాత్ర 66వ రోజు
- కలవచర్ల గ్రామ ఉపాధి హామీ రైతుకూలీలతో “గురుదత్”
రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 66వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న రైతుకూలీలను ఉదయాన్నే స్వయంగా వారి దగ్గరకి వెళ్లి, వారి వారి గ్రామంలో ఉన్న సమస్యలు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ రైతులకు చేసిన మేలుగురించి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేడ గురుదత్ ప్రసాద్ 700 మంది ఉపాధి హామీ రైతుకూలీలకు మజ్జిగ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కలవచర్ల గ్రామ మాజీ ఎంపీటీసీ అబ్బులు, గ్రామ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.49.01-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.49.03-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.49.03-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.49.01-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-26-at-2.49.02-PM-2-1024x576.jpeg)