పార్టీ యొక్క సిద్ధాంతాలను, మేనిఫెస్టోను కరపత్రాలుగా ప్రజలకు చేరవేస్తున్న ఎచ్చెర్ల జనసేన

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం జనసేన పార్టీ సిద్ధాంతాలను పార్టీ అధ్యక్షులు దూరదృష్టితో ఆలోచించి ఇచ్చిన హామీలను ప్రజల మధ్య తీసుకెళ్లాలని గడపగడపకు వివరించాలని ప్రతి యొక్క పౌరుడికి అర్థమయ్యే రీతిలో ఉండాలని కరపత్రాలను ముద్రించి కోటపాలెం పంచాయతీ భద్ర మహంకాళి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించి 2024లో ప్రజా ప్రభుత్వమే పరమావధిగా కంకణం కట్టుకొని గడపగడపకు వెళ్లి కరపత్రాలను అందిస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలను మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, ఆటోలకు మేనిఫెస్టో స్టిక్కర్లు అంటిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ. అలాగే ఈ కార్యక్రమంలో మండల నాయకులు లక్ష్మినాయుడు, శంకర్, దుర్గారావు, రాజారమేష్, బాబాజీ, సుర్య, కాశీ, ఎర్రయ్య, రాంబాబు, గణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.