ఈర్ల చెరువు పార్క్ – బీర్‌ల చెరువా ?

శేరిలింగంపల్లి మంజీర పైపులైన్ రూట్ లోని ఈర్ల చెరువు పార్కును సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డా.మాధవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యకరమైన పరిస్థితుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. చెరువు అభివృద్ధి కోసం మేయర్ విజయలక్ష్మి దత్తత తీసుకున్నప్పటికీ, పనులు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. చెరువును సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే డ్రైనేజీ నీటిని నేరుగా చెరువులో కలిపేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ప్రజలు తాగునీటికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాకింగ్ ట్రాక్ పూర్తిగా ధ్వంసమై, ప్రజలకు వాడే పరిస్థితి లేదు. మంజూరైన నిధులు ఎక్కడా కనిపించకుండా, కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్యావరణ పరిరక్షణ అనే మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. అభివృద్ధి లేకపోవడం ఒక్కటే కాదు, పార్క్ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి. ఎటు చూసినా బీర్ బాటిళ్లు, చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, చెరువు పునరుద్ధరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరిస్తోంది. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ నిరంజన్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు బి అరుణ్ కుమార్, చందానగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ ఉలిసి శ్రీనివాసరావు, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు హరి నాయక్, రమా రాహుల్ వివిధ కో-ఆర్డినేటర్ లు, నాయకులు, జనసైనికులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment