ఈద్ శుభాకాంక్షలు తెలియజేసిన చిరు, మహేష్‌

ఈద్ ఉల్ ఫితర్.. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు చాలా ప్రత్యేకం. ఈమాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. కానీ ఈద్ ఉల్ ఫితర్ రోజున ఉపవాసం ఉండే అవసరం లేదు. ఈద్ సందర్భంగా సెలబ్రిటీలు అందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో అందరికి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోషం అందించాలని కోరుకుంటున్నాను. అలానే ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మానవాళికి అన్ని బాధలు తొలగిపోవాలని ఆశిస్తున్నాను అని చిరు పేర్కొన్నారు. ఇక మహేష్ బాబు అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈద్ అందరికి శాంతి, ఆనందం అందిస్తుందని భావిస్తున్నాను అని ట్వీట్ చేశారు.