సింగనమల మండలంలో అంబికా లక్ష్మీనారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం

అనంతపురం: ఉమ్మడి (జనసేన, తెలుగుదేశం, బిజెపి) ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం సింగనమల మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తోట ఓబులేసు సోమవారం ఎంపీ అభ్యర్థి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. సోమవారం సింగనమల మండల కేంద్రంలోని నాయన పల్లి క్రాస్, పెరవలి, పోతురాజు కాలవ, చక్రాయిపేట, బండమీద పల్లి, శివపురం గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ప్రజలను కోరడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఓటు వేసేది సైకిల్ గుర్తుపైనే అని ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేస్తామని అభ్యర్థినీ గెలిపిస్తామని తెలియజేశారు. అనంతరం తోట ఓబులేసు మాట్లాడుతూ అనంతపురం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం మండల వ్యాప్తంగా మరియు నియోజకవర్గ వ్యాప్తంగా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వర్ధం, నరసప్ప, తోట రామ్మోహన్, మధుశేఖర్, మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు.