కోటవారిపల్లి నందు ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

పుంగనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్టీట్ కార్నర్ మీటింగ్స్ లో భాగంగా శుక్రవారం పుంగనూరు పట్టణలో జరిగిన కార్యక్రమంలో ఎన్.డి.ఏ ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ చల్లా రామచంద్రారెడ్డి సైకిల్ గుర్తు మరియు ఎంపీ గా బిజెపి పార్టీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కమలం పువ్వు గుర్తు పై నియోజకవర్గ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేస్తున్న అరాచకాలు మరియు దౌర్జన్యాలు రాబోవు ఉమ్మడి ప్రభుత్వం చేసే కార్యక్రమాలపై ప్రజలకు వివరించడం జరిగింది.