సత్తెనపల్లి రూరల్ మండలంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి రూరల్ మండలం, కందులవారి పాలెం మరియు గోగులపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు జనసేన పార్టీ బొర్రా వెంకట అప్పారావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి కన్నా లక్షి నారాయణ గారిని గెలిపించాలని బొర్రా వెంకట అప్పారావు గారు ఓటు ను అభ్యర్థించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి శాసనసభ్యుడిగా కన్నా లక్ష్మి నారాయణ గారిని పార్లమెంటు సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయల గారిని అఖండ మెజారిటీ తోటి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ, మండల గ్రామ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.