ఏలూరు నియోజకవర్గ జనసేన ముఖ్యనాయకుల సమావేశం

ఏలూరు: ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అధ్యక్షతన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్యనాయకులతో సమావేశం మరియు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు అధ్యక్షతన ఏలూరు నగర నూతన కమిటీ ప్రకటన కార్యక్రమం ఆదివారం ఏలూరు నియోజకవర్గ పార్టీ ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి మేకా ఈశ్వరయ్య, పోలవరం నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజు, ఉంగుటూరు నియోజకవర్గ ఇంచార్జి పత్సమట్ల ధర్మరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, చనమళ్ళ చంద్రశేఖర్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.