ఏలూరు జనసేన పార్టీ 13వ డివిజన్ కమిటీ నియామకం

ఏలూరు: జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ డివిజన్ కమిటీల బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ 13వ డివిజన్ కు 11 మంది సభ్యులతో కూడిన కమిటీని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు శనివారం నియమించారు. డివిజన్ ఇన్చార్జిగా కూర్మా సరళ, డివిజన్ అధ్యక్షుడుగా తోట రాజేష్, ప్రధాన కార్యదర్శిగా నగర బోయిన పండుని నియమించారు. నగరాధ్యక్షుడు కాశి నరేష్ సమక్షంలో నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు డివిజన్ లో ప్రజా సమస్యలు పార్టీ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.