ఏలూరు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: పవన్ కళ్యాణ్

ఏలూరులో పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘ఏలూరులో యుద్ధ ప్రాతిపదికన వైద్య సహాయం అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేన ప్రతినిధులు చెబుతున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోగిని పరీక్షించిన వైద్యులు వ్యాధి ఏమిటో ప్రాథమిక అంచనాకు రాలేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది’ అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వైద్య  నిపుణులను ఏలూరుకి రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావలసిన అవసరం వుంది. ఆ దిశగా ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏలూరు నగరమంతా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసే విధంగా యంత్రాంగాన్ని మోహరించాలి. బాధితులకు అండగా వుండవలసిందిగా జనసేన నాయకులు, కార్యకర్తలను కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.