సత్యసాయి జిల్లాలో జనసేన పార్టీలోకి వలసలు

పుట్టపర్తి నియోజవర్గం కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామానికి చెందిన 10 కుటుంబాలు రామాంజనేయులు, బుక్కపట్నం రాజేంద్ర, బుక్కపట్నం మనీ, బుక్కపట్నం భార్గవ, బుక్కపట్నం మదన్మోహన్, కొయ్యగూర నారాయణ, కొయ్యగూర ప్రకాష్, తలారి రామాంజనేయులు తదితరులు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కలసి పనిచేసి గ్రామ స్వరాజ్యం సాధ్యం అవుతుంది అని భావించి కొత్తచెరువు మండల కన్వీనర్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కొత్తచెరువు సందర్శించిన సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గం రాజకీయాలలో అలజడి మొదలైంది, ప్రతి గ్రామంలోనూ సామాన్య ప్రజలు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సందర్భంగా పూల శివ ప్రసాద్ తెలియపరిచారు.