ఇంగ్లీష్ మీడియం కాదు ఇంగిత జ్ఞానం కావాలి: ఆదాడ మొహన్ రావు
పార్వతీపురం, అంగన్వాడీ వర్కర్ల నిరసన సమ్మెకి మద్దతుగా నిరసనలో జనసేన పార్టీ పార్వతీపురం జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు ఆదాడ మోహన్ రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లకి కనీస వేతనం పెంచాలని, ఈ ప్రభుత్వానికి అంగన్వాడి వర్కర్లు అంటే చిన్న చూపని వాళ్లని ప్రభుత్వం గుర్తించలేదని రియల్ ఎస్టేట్, అక్రమ అరెస్టులపై ఉన్న శ్రద్ధ అంగన్వాడి వర్కర్లపై లేదని చెప్పడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-13-at-21.23.57-576x1024.jpeg)