జనసైనికుడి స్థలం కబ్జాయత్నం.. కాపాడిన ఎన్ని రాజు

ఎచ్చర్ల నియోజకవర్గం, జి. సిగడం మండలం, నిద్దం గ్రామపంచాయతీ పరిధిలో గల జనసైనికుడు మీసాల అన్నం నాయుడుకు చెందిన స్థలాన్ని వైసిపి వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు, ఈ విషయం తన దృష్టికి తీసుకువచ్చిన జనసైనికులతో కలిసి రాజాం నియోజవర్గ జనసేన నాయకులు ఎన్ని రాజు అక్కడికి వెళ్లి స్థలాన్ని కబ్జా కాకుండా వైసిపి వారిని నియంత్రించడం జరిగింది. అనంతరం బాధిత కుటుంబన్ని ఎన్ని రాజు పరామర్శ చేసి వారిలో ధైర్యాన్ని చెప్పి జనసేన పార్టీ మీ కుటుంభానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.