జనసేనలో చేరికలు
ఉరవకొండ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు పలువురు యువత జనసేన పార్టీలోకి చేరారు. యువత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం విడపనకల్ మండలం కొత్తకోట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన 30 మంది కుటుంబాలు మండల అధ్యక్షులు తలారి గోపాల ఆధ్వర్యంలో యువతను ఇంచార్జి గౌతమ్ కుమార్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మండల అధ్యక్షులు తలారి గోపాల్ మాట్లాడుతూ మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విడపనకల్ మండల అధ్యక్షులు తలారి గోపాల్, వజ్రకరూరు మండల అధ్యక్షుడు ఆచనాల కేశవ్, కుడేరు మండల అధ్యక్షుడు నగేషు, ప్రధాన కార్యదర్శి లోకేష్, ఉరవకొండ కార్యదర్శి మణీకుమార్, నాయకులు భద్ర రమేష్, రాజు, ధనుంజయ్, వంశీ, రఘు, అభి, చేరిన వారు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-20-at-13.20.19-1024x461.jpeg)