పూతలపట్టులో జనసేనలో చేరికలు

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, రత్నగిరి గ్రామంలో శీను, సెల్వ ఆధ్వర్యంలో మన ఊరు మనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేన ధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆశయాలకు ఆకర్షితులై సుమారు 20 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ ద్వారానే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఎటువంటి కులమత బేధాలు లేకుండా ఆయన పరిపాలిస్తారని గ్రామస్తులు నమ్ముతున్నారు అని, ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటాం అని తెలియజేశారు. గ్రామస్తులు రామ్మూర్తి, కృష్ణయ్య, హరిబాబు, బుజ్జయ్య, మనోహర్, మణిరత్నం, ప్రభాకర్, రవి, జ్ఞానేశ్వర్, నాగేంద్ర, వేణు, శ్రీనివాసులు, రాజకుమార్, దేవరాజులు, ధన శేఖర్, మోతీష్, హిమాద్రి, దిలీప్ లు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మండల అధ్యక్షులు పురుషోత్తం ఉపాధ్యక్షులు సానే నవీన్, శీను ప్రధాన కార్యదర్శులు తులసి బాబు, తమ్మిశెట్టి మోహన్ బాబు, రెడ్డప్పా, భాను ప్రకాష్ వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయ్, తులసి, శ్రీకాంత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.