లోకం మాధవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనసేనలో చేరికలు

నెల్లిమర్ల నగర పంచాయతీ, జరజాపుపేట గ్రామంలో లోకం మాధవి పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జరజాపుపేట గ్రామానికి చెందిన మహిళలు లోకం మాధవిని ఘనంగా స్వాగతించారు. గ్రామంలోని ప్రతి ఇంటి ఇంటికితిరుగుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని అలాగే వైసిపి ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని, పిలుపునిచ్చారు. జరజాపుపేట గ్రామంలో పర్యటిస్తున్న లోకం మాధవి దగ్గరికి అనేక సమస్యలు వచ్చాయి వాటిలో గ్రామంలో అధికంగా ఉన్న నీటి సమస్య, శుభ్రంగా లేని పారిశుద్ధ్యం,ఊరిలో దయనీయ స్థితిలో ఉన్న కాలువలు వలన ప్రజలు అవస్థలకి గురవుతున్న గ్రామస్థుల గురించి మాధవి దృష్టికి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఆడపడుచులపై జరుగుతున్న అరాచకాలు చూసి ఈ నీచపు ప్రభుత్వంపై విసుగు చెంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవి నిత్యం ప్రజా క్షేమం కోసం పాటు పడుతున్న విధానం నచ్చి జరజాపుపేట గ్రామంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో సుమారు 300 మంది జనసేన పార్టీ తీర్థ పుచ్చుకున్నారు. పార్టీలో జాయిన్ అయిన మహిళలు మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్ల నుండి మాధవి సహాయ సహకారాలు, మంచి మనసు చూసి, పేదవాడు ఎప్పటికైనా పెద్దవాడు కావాలనే మనస్తత్వం ఉన్న ఆవిడని చూసి జనసేన పార్టీలోకి జాయిన్ అయినట్టు తెలియజేశారు. వీరందరికీ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండల యువ నాయకులు రవ్వ నాని మరియు తన అనుచరుగణం వారితో పాటు మద్దిల అప్పన్న, నల్లి దుర్గారావు, తమ్మిని చంద్ర మౌళి, మధ్డిల నాగరాజు, పెడ్డపుడి రాంబాబు, బొడ్డు రమణ, మద్దిల(కృష్ణ) పెద్దయ స్వామి, కనకల అప్పారావు, కరుమంచి గోవింద్ పతివాడ శ్రీనివాస్ వాసు మరియు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.