నరసాపురం జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం సీతారామపురం గ్రామం క్షత్రియ సామాజికవర్గానికి చెందిన జంపన గోపాలకృష్ణం రాజు(బుల్లెట్ రాజు), జంపన శ్రీనివాసరాజు, జంపన గణపతిరాజు, జంపన సత్యనారాయణరాజు, జంపన వెంకట సుబ్బరాజు, జంపన గోపాలకృష్ణం రాజు(గోపీ రాజు), జంపన జగన్నాథరాజు, జంపన గుర్రాజు, జంపన కృష్ణంరాజు, కునాధరాజు బలరామరాజు, కునాధరాజు సాయిరాజు, జంపన రామచంద్రరాజు, జంపన శశాంక్ వర్మ, జంపన శయంత్ వర్మ, జంపన మణికంఠ వర్మ, జంపన రిషి వర్మ, వత్సరాజు సీతారామరాజు, జంపన రామకృష్ణం రాజు, సయ్యపరాజు వికాసవర్మ, ఇందుకూరి నిఖిల్ వర్మ, కునాధరాజు వినోద్ వర్మ మరియు వారి అనుచరులు దాదాపుగా 50 మంది కలవకొలను తాతాజీ ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కొండవేటి త్రినాథ్, వలవల కుమార్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.