బొంతు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

  • రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో ఎస్ సి సామజిక వర్గం నుండి రామేశ్వరం చర్చిపేట నవోదయ యూత్ జనసేనలో జాయినింగ్స్

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామంలో చర్చి పేట నవోదయ యూత్ లీడర్ పిల్లి ప్రదీప్ సమక్షంలో ఆదివారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నుండి యూత్ వారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బోణం రాజు, వైస్ సర్పంచ్ పాటబళ్ళ సూరిబాబు, నల్లి విజయ రత్నం, మేకల ఏసుబాబు, సత్యనారాయణ, ముప్పర్తి నాని ప్రసాద్, నల్లి కిరణ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.