పొదలాడ గ్రామంలో 80 సభ్యత్వాల నమోదు

రాజోలు నియోజకవర్గం, జనసేన కార్యకర్తలకు అండగా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం పొదలాడ గ్రామంలో మొదటి సంవత్సరం 11, రెండవ సంవత్సరం 44, మూడవ సంవత్సరం 80 సభ్యత్వాలు నమోదవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజోలులో మరొకసారి జనసేన గెలుపు ఖాయమని అన్నారు. జనసేన కార్యకర్తలకి గ్రామ ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామశాఖ అధ్యక్షులు పంచదార చిన్నబాబు, రావూరి సాయి, మేడిచర్ల సతీష్, నార్ని త్రిమూర్తులు మరియు శిరిగినీడీ బాబ్జి పాల్గొన్నారు.