పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జనసేన నాయకులు

ఎమ్మిగనూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 52వ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక గర్ల్స్ కాలేజ్ నందు జనసేన నాయకుల ఆధ్వర్యంలో 50 పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్, బీటీ బజారి మాట్లాడుతూ జనసేన పార్టీ, సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా గురువారం గర్ల్స్ కాలేజ్ నందు పూల మొక్కల పంపిణీ చేశామని అన్నారు. చాలా మంది వారి వ్యక్తిగత అవసరాల కోసం పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని మనము ఎక్కడ చూసినా చెట్లు పెంపకం గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గాయని, ఇలా ఉంటే పర్యావరణానికి ఎంతో నష్టమని, కనుక ప్రతి పౌరుడు తమ బాధ్యతగా తమ ఇంట్లో గానీ, తమ వ్యాపార స్థలంలో గానీ, చదువుతున్న కళాశాలల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షబ్బీర్, మల్లికార్జున, వెంకీ, రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.