ఎర్రవారి పాలెం జనసేన మండల స్థాయి సమావేశం

చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ సూచనల మేరకు ఎర్ర వారి పాలెం మండల కమిటీ సమావేశం ఆదివారం మండల అధ్యక్షులు ముండ్లపాటి మురళి, జిల్లా కార్యదర్శి కలప రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సమావేశము నందు కార్యకర్తలకు కమిటీ మెంబర్స్ కు దిశానిర్దేశం చేయడం జరిగినది. మనసేన కోసం నా వంతు కార్యక్రమమును జనసైనికులకు వివరించి.. వారికి అవగాహన కల్పించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని విన్నవించడం జరిగినది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆదర్శాలు ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని జనసైనికులను కోరడం జరిగినది. అదేవిధంగా ఎర్రవారిపాలెం మండలంలో చాలామంది యువత జనసేన పార్టీలో చేరడం జరిగినది. చేరిన వారు సురేష్ బాల, పి సుబ్రహ్మణ్యం, మధురంజన్ రెడ్డి, లోకేష్, విశ్వనాథం, హరి, రాజు తదితరులు పార్టీలో ఆశయాలను నచ్చి జనసేన కండువా కప్పుకోవడం జరిగినది. సదరు కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు చింతకాయల కృష్ణయ్య, జిల్లా కార్యదర్శులు బీగాల అరుణ, ఆనంద్, చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షులు దూది జస్వంత్, ఎర్రవారిపాలెం మండలం ఉపాధ్యక్షులు ఎర్ర నరేంద్ర, మండల జనరల్ సెక్రెటరీ గుర్రప్ప గారి విశ్వనాథం, కార్యదర్శులు తదితరులు పాల్గొనడం జరిగినది.