పుర ఎన్నికలపై ఫిర్యాదులకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు: ఎస్‌ఈసీ

విజయవాడ: ఎస్‌ఈసీ ఆఫీస్‌లో కాల్‌ సెంటర్‌ను నేడు ఏర్పాటు చేశారు. పుర ఎన్నికలపై ఫిర్యాదుల కోసం ఈ కాల్‌ సెంటర్‌ను ఎస్‌ఈసీ ఏర్పాటు చేసింది. విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌ను ప్రజలు 0866 2466877 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. కోడ్‌ ఉల్లంఘన జరిగితే ఎవరైనా సరే కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ తెలిపింది.