తిరుపతి జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో, పార్టీ పీఏసీ సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్ చేతులు మీదగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రోజురోజుకి పెరుగుతున్న ఎండలో దృష్టిలో ఉంచుకొని ప్రజలు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తిరుపతి రూరల్ మండలం, మంగళం జనసేన నాయకులు జనసేన సాయి, కిషోర్, భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని పాదచారులకు, పరిసర ప్రాంత ప్రజలకు దాహార్తిని తీర్చాలని ఉద్దేశంతో ఈ చలివేంద్రం ప్రారంభించామన్నారు. రోజురోజుకీ ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి బాటసారి, జనసేన తిరుపతి రూరల్ నాయకులు , జనసేన సాయి, యువకిషోర్, భాస్కర్, తిరుపతి పట్టణ కార్యదర్శి కిరణ్ కుమార్, చందు, జనసైనికులు, వీరామహిళలు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.