ఓడిసిలో జనసేన కార్యాలయం ఏర్పాటు

  • పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం
  • జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్

పుట్టపర్తి, జనసేన పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఓడిసి మండలం కొండకమర్ల గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శక్తివంచ లేకుండా కృషి చేస్తామన్నారు. జనసైనికులు ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని, భవిష్యత్తులో అది రక్షణ కవచంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి చిలకం మధుసూదన్ రెడ్డి, పత్తి చంద్రశేఖర్ లు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మండల ముఖ్య నాయకులు కొండబోయిన సతీష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి రాపా ధనుంజయ, బుక్కపట్నం మండల అధ్యక్షులు జయరాం, ఓడిసి మండల అధ్యక్షులు ఈశ్వర్, పుట్టపర్తి మండల అధ్యక్షులు పెద్దన్న, నల్లమడ మండల అధ్యక్షులు మహేష్, జిల్లా కార్యదర్శి అవకు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.