ఉత్తరాంధ్ర జనసేన త్రిసభ్య కమిటీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్ ను కలిసిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు

ఉత్తరాంధ్ర జనసేన పార్టీ సంస్థాగత త్రిసభ్య కమిటీ సభ్యులుగా నియమితులై మొట్టమొదటి సారిగా రాజాం విచ్చేసిన శ్రీ ముత్తా శశిధర్ ని ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ డా.విశ్వక్షేణ్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో MPTC గా పోటీ చేసిన అభ్యర్ధులు, సర్పంచ్ లు కూడా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మధుబాబు, దుర్గరావు, బాబాజీ, సూర్య, సందీప్, రాజారమేష్, లక్ష్మినాయుడు, శంకర్ జనసేన కార్యకర్తలు సత్య, పవన్ కళ్యాణ్, నాని, తిరు, సంతోష్, వేణు, జనసైనికులు పాల్గొన్నారు.