జగనన్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూడన్నా రోడ్లైనా వెయ్యన్న

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి పెరమాళ్ళపల్లి గ్రామ ప్రజల సమస్యలను తీసుకెళ్తాం
  • రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, పులేరు పంచాయతీ పెరుమాళ్ళ పల్లి రోడ్డు అద్వాన్నంగా ఉందని ఇదే రోడ్డుపై రోజు 3 కిలోమీటర్లు విద్యార్థులు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని కంకరలో 3 కిలోమీటర్లు నడవలేం జగన్ మావయ్య మాకు రోడ్డు వేయండి అంటూ ఇటీవల పేపర్ లో వచ్చింది. ఇది చూసిన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మంగళవారం గోరంట్లకి విచ్చేసి విద్యార్థులతో కలసి పాదయాత్రగా రోడ్డుపై నడచి నిరసన తెలియజేయడం జరిగింది. అక్కడ నుండి పెరుమాళ్ళపల్లి గ్రామ దారిని సందర్శించి గ్రామంలోని ప్రజలు యొక్క కష్టాలను తెలుసుకున్న అనంతరం అనంతరం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని. జగనన్న కళ్ళు తెరిచి చూడన్నా, రోడ్డైనా వెయ్యన్న జగనన్న ఈ విద్యార్థులకు ఎన్నాళ్లు ఈ కంకర రాళ్ల చదువులు వెంటనే రోడ్డు వేసి బస్సు సౌకర్యం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అలాగే జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, వెంకటేష్, గోరంట్ల మండల అధ్యక్షులు సంతోష్, పెనుగొండ టౌన్ అధ్యక్షులు లోకేష్, వీరమహిళా శ్రీమతి శ్రీదేవి మరియు నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.