ప్రతి ఇంట సంక్రాంతి కానుక
- జోగా వీర వెంకట రమణ యాదవ్!
పిఠాపురం పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంట సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని కీర్తిశేషులు జోగా గనిరాజు నూకాలమ్మ దంపతుల ఆశీర్వాదంతో జే.జి.ఆర్.గ్రూప్స్ చైర్మన్ మరియు మాజీ పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జోగా వీర వెంకట రమణ యాదవ్, గంగా రామకుమారి 150 కుటుంబాలకు బియ్యం మరియు కూరగాయలు నిత్యవసర వస్తువులను ఇవ్వటం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఏటలాగే సంక్రాంతి కానుకలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు దేవర వెంకట్రావు, దాసరి బాలకృష్ణ, అన్నెం నాగేశ్వరరావు, గరగా వీర్రాజు, గోపాలపు సత్యనారాయణ, సారిపల్లి రాము తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-16-at-7.08.18-PM-1024x461.jpeg)