రాబోవు ఎన్నికలకు ప్రతి జనసైనికుడు సిద్ధం కావాలి: వివేక్ బాబు

ప్రొద్దుటూరు నియోజకవర్గం: రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి వివేక్ బాబు ప్రొద్దుటూరు నియోజకవర్గ జనసైనికులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు నాయకులని కార్యకర్తలను అభినందించారు. తదుపరి ప్రొద్దుటూరు జనసైనికులు చేయవలసిన కార్యక్రమాలను భవిష్యత్ పార్టీ అలోచనలు వివరించి సలహాలు సూచనలు ఇచ్చారు. రాబోవు ఎన్నికలకు ప్రతి జనసైనికుడు సిద్ధం కావాలని నేటి నుండే క్షేత్ర స్థాయిలో శ్రమించాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారి మనోగతాన్ని అర్ధంచేసుకొని ఆయన సిద్ధాంతాలలో ఆశయాలకి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు జిలాన్ బాషా, మంచాల సంజీవ్, రామాజి ప్రసాద్, పత్తి శివకల్యాణ్, జి విజయ్, షోయబ్, వినోద్, కేశవ్, లక్ష్మణ్ సింగ్, నాగరాజు, అబ్దుల్, సిద్దిక్, జబీవుల్లా, సుదీర్, వల్లి, గౌతమ్. తదితరులు కార్యకర్తలు పాల్గొనారు.