పవన్ కళ్యాణ్ ను అందరూ ఆదరించి ముఖ్యమంత్రిని చేయాలి: రాజంపేట జనసేన నాయకులు

  • పవనన్న ప్రజా బాట 49వ రోజు

రాజంపేట: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజలందరూ, ఆదరించి ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయాలని, రాష్ట్రంలో సుపరిపాలన పొందాలని పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు శుక్రవారం పవనన్న ప్రజా బాట 49వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజంపేట మండల పరిధి ఊటుకూరు పంచాయతీలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను అందజేసి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆకాంక్షలు అధికారంలోకి వస్తే రాస్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి చేపట్టనున్న చర్యల గురించి ప్రజలందరికీ వివరించారు. పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంగా దృఢ సంకల్పంతో రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాలతో తాము పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామనన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో అందరూ, అన్ని అంశాలను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ ను ఆదరించాలని, జనసేనకు అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి కాపాడి రాష్ట్రం ప్రగతి బాటగా పయనించే విధంగా పాలన అందించే సత్తా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కె ఉందన్నారు. అనంతరం రాజంపేట జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కాలమానిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, కడప లీగల్ సెల్ అధ్యక్షులు కరుణాకర్ రాజు, ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు జనసేన నాయకులు భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య, బాలసాయి, కోలాటం హరి పోలిశెట్టి శ్రీనివాసులు, గోపి, ఆచారి, భువనగిరిపల్లి, నందలూరు, సుండుపల్లి సిద్ధవటం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.