కష్టపడే ప్రతీ ఒక్కరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.. ఆళ్ళ హరిని అభినందించిన జనసేనాని

  • ప్రజలతో నిత్యం మమేకం అవుతూ, వారి కష్టాల్లో అండగా ఉండండి
  • సామాన్యుల నుంచి జనసేన పార్టీ ప్రజా నాయకుల్ని తయారుచేస్తుంది
  • గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరిని ప్రత్యేకంగా అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

మంగళగిరి: బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరుగెడుతుందో ప్రజలు ఎటువంటి ఆపదలో ఉన్నా వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా నాయకులు కూడా అదేవిధంగా స్పందించి ప్రజలకు అండగా నిలవాలని, అలాంటి నాయకులను సమాజానికి అందించటమే జనసేన లక్ష్యాలలో ఒకటని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో, నగరంలో పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఆళ్ళ హరి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ప్రధానంగా టీ కొట్ల వద్ద, కిరాణా దుకాణాల వద్ద, మాల్స్ వద్ద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమ విశేషాలను, దళిత, బీసీ వాడల్లో సహపంక్తి భోజన కార్యక్రమాలను ఆళ్ళ హరి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గత కార్పొరేటర్ ఎన్నికల్లో జీరో పాలిటిక్స్ చేస్తూ వైసీపీ, టీడీపీ లకు గట్టి పోటీ ఇవ్వటంతో పాటూ విభిన్న కార్యక్రమాలతో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అహరహం కష్టపడుతున్నావంటూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆళ్ళహరిని అభినందించారు. పార్టీలో కష్ట పడిన ప్రతీ ఒక్కరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశం పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యత ఉన్న యువకులు జనసేన పార్టీ వేదికగా ప్రజా నాయకులుగా ఎదగాలని పవన్ కళ్యాణ్ అభిలాషించారు.