బచ్చులేటిగూడెంలో గ్రామప్రజలతో ముఖాముఖీ

పోలవరం, తి.నరసాపురం మండలం బచ్చులేటిగూడెం గ్రామంలో మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు గ్రామ ప్రజల వద్దకు వెళ్లి ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధానంగా నీటి సమస్య ఎక్కువగా ఉందని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సిద్ధం అని ఫ్లెక్సీలు వేసుకుని హంగులు ఆర్భాటాలు చేసుకోవడానికి, తప్పా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఓట్లు కోసం వస్తే ఎమ్మెల్యేకి బుద్ది చెప్తామని గ్రామస్థులు తెలిపారు.