“రైతు భరోసా యాత్ర” టీం-పిడికిలి పోస్టర్లతో ప్రచారం
శ్రీకాకుళం: 3000 మంది ఆత్మహత్య చేసుకునటువంటి కౌలు రైతుల కుటుంబాలకు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కష్టార్జితం 30 కోట్ల రూపాయిలను అందజేయడం జరుగుతుంది. ఈ సహాయ కార్యక్రమాల గురించి శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజవర్గం జనసేన పార్టీ నాయకులు కోరుకొండ మల్లేశ్వరరావు మరియు పొందూరు మండలం జనసేన నాయకులు ఆధ్వర్యంలో.. పలు గ్రామాలలో టీమ్ టీం పిడికిలి సహకారంతో పోస్టర్లను ఆటోలకి మరియు బహిరంగ ప్రదేశాల్లో అతికించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండలం జనసేన నాయకులు చిన్నము నాయుడు, అప్పల నాయుడు, శివ, బాబురావు, సురప నాయుడు, లక్ష్మణరావు, ఆసిరి నాయుడు మరియు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆమదాలవలస జనసేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-12.31.57-PM-1024x470.jpeg)