సుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి: రైతులు, ప్రతిపక్షాల డిమాండ్

ఆమదాలవలస, సుగర్ ఫ్యాక్టరీ దగ్గర షేర్ హోల్డర్స్, రైతులుతో కలిసి ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ గెలిస్తే సుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను అని ఆమదాలవలస నడిబొడ్డున వాగ్దానం చేసిన జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తరువాత ఆ సమస్యనే పట్టించుకోవడం మానేశారు అలానే నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ తెలిపిస్తాను లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన తమ్మినేని సీతారాం ఇప్పుడు ఏమీ పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నారు నియోజకవర్గ ప్రజలను నమ్మించి మోసం చేశారు. రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని మండిపడ్డారు. సిపిఎం పార్టీ నాయకులు బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ..హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా సరే ప్రభుత్వం ఏపిఐఐసి కి అప్పచెప్పడం ఎంటని ప్రశ్నించారు. రైతులు మాట్లాడుతూ.. ఈ సుగర్ ఫ్యాక్టరీ పై ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు చెరుకు పంటకు సాగు నీరు అనుకూలంగా ఉంది కావున ప్రభుత్వం త్వరగా మేలుకొని ఫ్యాక్టరీ తినిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు దన్నాన లచ్చయ్య, సాదు రామారావు, పైడి వాసుదేవ రావు, మురళీ మోహన్, ధనుంజయ రావు, గణేష్, సింహాచలం, కోటేశ్వరరావు, సురేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.