పాటంశెట్టి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన పితాని

జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర అచ్యుతాపురం గ్రామంలో నుండి 33 కెవి హైటెన్షన్ వైర్లు లైన్ నివాస గృహాల మధ్య నుండి వెళ్లడం వలన గ్రామానికి, గ్రామ ప్రజలకు ప్రమాదం వాటిల్లుతుందని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో గత మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పాటంశెట్టి శ్రీదేవి సూర్యచంద్ర కి శనివారం జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియ చేసిన రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాలకృష్ణ ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి దూడల స్వామి, పార్టీ సీనియర్ నాయకులు సానబోయిన వీరభద్రరావు మరియు పార్టీ సీనియర్ నాయకులు కడలి కొండ తదితరులు పాల్గొన్నారు.