జనసేన మండలాధ్యక్షులతో సమావేశమైన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం మండల అధ్యక్షులతో జనసేన పార్టీ కార్యాలయం ముమ్మిడివరం నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ కమిటీ, బూత్ కమిటీల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గోలకోటి వెంకటేశ్వరరావు, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గోదాశి పుండరీస్, సానబోయిన వీర భద్రరావు, కడలి కొండ, యలమంచిలి బాలరాజు, చిట్టూరి దొరబాబు, దొమ్మేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.