జి.మూలపొలం పంచాయితీలో ఇంటింటికి జనసేనలో పాల్గొన్న పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ.పోలవరం మండలంలో ఇంటింటికి జనసేన పవన్ రావాలి పాలన మారాలి రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం జి. మూలపాలెం గ్రామంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఇంటింటికి పర్యటించడం జరిగింది. ముందుగా జి మూలపొలం పంచాయతీ నందు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించి, భారతరత్న బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాల అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం జి.మూలపొలం పంచాయితీలోగల అంబేద్కర్ కాలనీ తూముకాడపేట, భీమ్ నగర్, వెంకటకృష్ణాపురం, ఎర్రగరువు, ఎర్రగరువు ఎస్సి పేట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంచి గాజు గ్లాస్ పై ఓటు వేసి బాలకృష్ణని గెలిపించాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకుని వాటిని కచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో అన్ని సమస్యలు తీరుస్తానని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా కార్యవర్గసభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.