శ్రీ సత్తెమ్మతల్లి అమ్మవారి 50 వ స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, ముమ్మిడివరం మండలం సి.హెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ సత్తెమ్మతల్లి అమ్మవారి 50 వ స్వర్ణోత్సవ వేడుకలలో రాష్ట్ర జనసేనపార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జునరావు, కడలి వెంకటేశ్వరరావు (కొండ), గాలిదేవర బుల్లి, సానబోయిన వీరభద్రరావు, గుద్దటి విజయ్, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, చిట్టూరి దొరబాబు, మట్టపర్తి బుజ్జి, పితాని రాజు మరియు సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.