క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా చెక్కులను అందించిన పితాని

ముమ్మిడివరం మండలం, సిహెచ్ గున్నేపల్లికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు భోగి శెట్టి తిరుమల దుర్గ పల్లమరాజు మరియు ముమ్మిడివరం మండలం, అనాతవరం గ్రామానికి చెందిన మరొక క్రియాశీలక సభ్యులు మునుకోటి పల్లంరాజు అలియాస్ జాజి ఇటీవల యాక్సిడెంట్ కు గురయ్యారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున ఈ ఇరువురికి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ నిమిత్తం చెరొక 50000 వేల రూపాయల చెక్కులు పంపించి వారికి అందించవలసినదిగా సూచించారు. ఈ మేరకు వారిరువురికి శనివారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ చెక్కులు అందించడం జరిగింది. ముందుగా భోగి శెట్టి పల్లమరాజుకు 50,000 వేల రూపాయల చెక్కు అందజేశారు. అనంతరం మునుకోటి పల్లంరాజుకు 50,000 వేల రూపాయల చెక్కును పితాని బాలకృష్ణ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్ల కోటి వెంకన్న బాబు, గొల్లకోటి సాయిబాబు, యాళ్ల చంటి, గాలి దేవర బుల్లి, కడలి వెంకటేశ్వరరావు, బొక్క బుల్లబ్బాయ, శీలం వెంకటేశ్వరరావు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.