అంగన్వాడి వర్కర్స్ సమ్మెకు పితాని మద్దతు

ముమ్మిడివరం: అంగన్ వాడి టీచర్స్, వర్కర్స్, హెల్పర్స్, గౌరవ వేతనం కోసం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోన్నందున నిరవధిక సమ్మెకు దిగిన కారణంగా మంగళవారం జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం తాళ్లరేవు ఎం ఆర్ ఓ ఆఫీస్ ఎదురుగా జరుగుతున్న అంగన్వాడీ నిరవధిక సమ్మెలో కూర్చుని వారికి మద్దతు ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారియొక్క సమస్యలను పితాని బాలకృష్ణ దగ్గర మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తల యొక్క డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. మా జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అన్నివిధాలా ఆదుకుంటాం అని, వారిసమస్యలను పరిష్కరిస్తామని జనసేన పార్టీ తరపున వారికి హామీ ఇచ్చారు. వీరివెంట తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, దూడల స్వామి, పెన్నాడ శివ, పితాని రాజు, సుందరంపల్లి సత్యనారాయణ, కొమ్మోజు సుబ్రహ్మణ్యం, కర్నీడి నాని, నరాల వెంకటరమణ, నరాల రామకృష్ణ, సూరంపూడి కుమార్ మొదలగువారు పాల్గొన్నారు.