ఆడ పిల్లలు-సాంకేతిక విద్య కొరకు తమ గళాన్ని వినిపించిన తెలంగాణ రాష్ట్ర వీరమహిళా విభాగం

ఆడపిల్లలు సాంకేతిక విద్యను అభ్యసించేలా 1961 లో ప్రారంభించిన కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాల నుండి అన్ని కోర్సులకు అనుమతి మంజూరు చేయాలని నిర్వహించిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు లో జనసేన వీరమహిళ తెలంగాణ విభాగం రాష్ట్ర కమిటీ పాల్గొని తమ గళం వినిపించారు. #శవెఖ్ణ్ఫ్వ్ అంటూ విద్యార్థినిలు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన జనసేన తెలంగాణ వీరమహిళా విభాగం. ఈ కార్యక్రమంలో విభాగ వైస్ చైర్మన్లు శ్రీమతి నీహారిక, శ్రీమతి రత్న, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ శ్రీమతి పద్మజ, శ్రీమతి వెంకట లక్ష్మి, పార్టీ అడ్మినిస్ట్రేషన్ విభాగం శ్రీమతి జయ కళ్యాణి పాల్గొన్నారు.