అరకు నియోజకవర్గ జనసేన క్షేత్రస్థాయి బలోపేత సమావేశం

అరకు నియోజకవర్గం, ముంచింగిపుట్టు మండలంలో బుధవారం గంపరాయి జవహర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జనసైనికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం నుంచి ముఖ్యమైన జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలోనే పార్టీలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు భారీఎత్తున యువత, మహిళలు చేరబోతున్నారు అని తెలిపారు. జనసేన పార్టీని గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ఈ సమావేశం జరిగిందని తెలియజేసారు.