జనసైనికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

రంపచోడవరం, వి.ఆర్.పురం మండలం, వడ్డిగూడెం గ్రామ జనసైనికుడు కోట్ల సాయిబాబు వాళ్ళ తండ్రి కోట్ల వెంకన్న అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం. వారికి వి.ఆర్.పురం మండలం జనసేన పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున ఆరువేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, ఉపాధ్యక్షురాలు బాగుల ప్రమీలా రాణి, మండల కార్యదర్శి బాగుల అంజనరావు, మండల నాయకులు ములకాల కిషోర్ కుమార్, కోట్ల విజయరామరాజు, పెడపెట్ల పవన్ కళ్యాణ్, పెట్ట నాగేంద్ర, కాపారపు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment